ETV Bharat / snippets

ఇల్లందులో 53 కేజీల గంజాయి స్వాధీనం - నలుగురు అరెస్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 11, 2024, 6:06 PM IST

53 Kg Ganja Seized In Yellandu
53 Kg Ganja Seized In Yellandu (ETV Bharat)

53 Kg Ganja Seized In Yellandu : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఇల్లందువైపు కారులో అక్రమంగా తరలిస్తున్న 53 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.13 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

డీఎస్పీ చంద్రభాను తెలిపిన వివరాలు ప్రకారం ఒడిశా నుంచి ఉత్తరాఖండ్​కు భద్రాద్రి జిల్లా మీదుగా గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిపై నిఘా పెట్టిన పోలీసులు అనుమానం వచ్చి ఓ కారును తనిఖీ చేశారు. ఈ క్రమంలో పోలీసులను చూసి ఆ కారు డ్రైవర్​ పరారయ్యాడు. ఆ వాహనాన్ని పరిశీలించగా ప్యాకెట్లతో ఉన్న గంజాయిని గుర్తించారు. కారులో ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో మరో నలుగురు పరారైనట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులంతా ఉత్తరాఖండ్​కు చెందిన వారిగా గుర్తించారు.

53 Kg Ganja Seized In Yellandu : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఇల్లందువైపు కారులో అక్రమంగా తరలిస్తున్న 53 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.13 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

డీఎస్పీ చంద్రభాను తెలిపిన వివరాలు ప్రకారం ఒడిశా నుంచి ఉత్తరాఖండ్​కు భద్రాద్రి జిల్లా మీదుగా గంజాయిని తరలిస్తున్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిపై నిఘా పెట్టిన పోలీసులు అనుమానం వచ్చి ఓ కారును తనిఖీ చేశారు. ఈ క్రమంలో పోలీసులను చూసి ఆ కారు డ్రైవర్​ పరారయ్యాడు. ఆ వాహనాన్ని పరిశీలించగా ప్యాకెట్లతో ఉన్న గంజాయిని గుర్తించారు. కారులో ఉన్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో మరో నలుగురు పరారైనట్లు డీఎస్పీ తెలిపారు. నిందితులంతా ఉత్తరాఖండ్​కు చెందిన వారిగా గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.