ETV Bharat / snippets

సంగారెడ్డి, పటాన్​ చెరు మెట్రోకు డిసెంబరు నాటికి శంకుస్థాపన చేయండి : ఎంపీ రఘునందన్​ రావు

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 18, 2024, 4:52 PM IST

MP Raghunandan on Sangareddy Metro Rail
MP Raghunandan on Sangareddy Metro Rail (ETV Bharat)

MP Raghunandan on Sangareddy Metro Rail : పటాన్​ చెరు, సంగారెడ్డి వరకు మెట్రో రైలుకు ఈ ఏడాది డిసెంబరు నాటికి శంకుస్థాపన చేయాలని మెదక్​ ఎంపీ రఘునందన్​ రావు మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డిని కోరారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్​లను సిద్ధం చేసి మొదటి దశలో పటాన్​ చెరు, రెండో దశలో సంగారెడ్డి చౌరస్తా వరకు మెట్రో రైలును విస్తరించాలని విజ్ఞప్తి చేస్తూ రసూల్​ పురాలోని మెట్రో భవన్​లో ఎన్వీఎస్​ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మెదక్​ ఎంపీగా గెలిచాక చేపట్టిన తొలి కార్యక్రమం ఇదేనని ఆయన చెప్పారు. ఎంపీ అంటే మెంబర్​ ఆఫ్​ పార్లమెంటు కాదని మెట్రో పక్కా అని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు వెల్లడించారు. 30 రోజుల్లో డీపీఆర్​లు సిద్ధం చేసి మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తానని మెట్రో ఎండీ హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడతానని రఘునందన్​ రావు తెలిపారు.

MP Raghunandan on Sangareddy Metro Rail : పటాన్​ చెరు, సంగారెడ్డి వరకు మెట్రో రైలుకు ఈ ఏడాది డిసెంబరు నాటికి శంకుస్థాపన చేయాలని మెదక్​ ఎంపీ రఘునందన్​ రావు మెట్రో ఎండీ ఎన్వీఎస్​ రెడ్డిని కోరారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్​లను సిద్ధం చేసి మొదటి దశలో పటాన్​ చెరు, రెండో దశలో సంగారెడ్డి చౌరస్తా వరకు మెట్రో రైలును విస్తరించాలని విజ్ఞప్తి చేస్తూ రసూల్​ పురాలోని మెట్రో భవన్​లో ఎన్వీఎస్​ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మెదక్​ ఎంపీగా గెలిచాక చేపట్టిన తొలి కార్యక్రమం ఇదేనని ఆయన చెప్పారు. ఎంపీ అంటే మెంబర్​ ఆఫ్​ పార్లమెంటు కాదని మెట్రో పక్కా అని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నట్లు వెల్లడించారు. 30 రోజుల్లో డీపీఆర్​లు సిద్ధం చేసి మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్తానని మెట్రో ఎండీ హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడతానని రఘునందన్​ రావు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.