Suicide in Shameerpet : కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలతో కలసి తల్లి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిధ్దిపేట జిల్లా ములుగుకు చెందిన మర్కంటి భానుప్రియ(28) కుటుంబ కలహాలతో, రెండు రోజుల క్రితం తన ఇద్దరు పిల్లలని తీసుకొని ఇంట్లోంచి వెళ్లిపోయింది.
ఈ రోజు రాత్రి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట చెరువు నీటిలో భానుప్రియ, కుమార్తె దీక్ష(4) మృతదేహాలు లభ్యం అయ్యాయి. వారు ములుగుకు చెందిన భానుప్రియ, ఆమె పిల్లలేనని పోలీసులు గుర్తించారు. కుమారుడు వేదాన్ష్ ఆనంద్(5) మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గజఈతగాళ్లతో వెతికించగా పిల్లల మృతదేహాలు లభ్యం అయ్యాయి. భానుప్రియ మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.