Woman Maoist Killed at Bhadradri : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చెన్నాపురం గ్రామం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఒక మహిళా మావోయిస్టును హత్య చేసి రోడ్డుపై పడేశారు. చాలాకాలంగా మావోయిస్తు దళ సభ్యురాలుగా పని చేస్తున్న నీల్సో(రాధ)గా గుర్తించారు. ఆ మృతదేహం వద్ద మావోయిస్టులు ఒక లేఖను వదిలి వెళ్లారు. ఆ లేఖలో చాలాకాలంగా మావోయిస్టు దళ సభ్యురాలుగా పని చేసిన రాధ గత కొన్ని రోజులుగా పోలీసులకు ఇన్ఫార్మర్గా మారిందని మావోయిస్టులు పేర్కొన్నారు. ఆంధ్ర-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరుతో మావోయిస్టులు ఈ లేఖను విడుదల చేశారు. హైదరాబాద్లోని బాలాజీ నగర్కు చెందిన బాలయ్య, బాలమ్మలు కుమార్తె అని లేఖలో రాశారు. 2018లో ఆమె మావోయిస్టు పార్టీలో చేరినట్లు తెలిపారు. ఇన్నేళ్లు పని చేసి పోలీసుల బెదిరింపుల వల్ల ఇన్ఫార్మర్గా మారిందని అందుకే హత్య చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.
అలా చేసిందనే అనుమానంతో - మహిళను చంపేసిన మావోయిస్టులు
Published : Aug 21, 2024, 1:49 PM IST
Woman Maoist Killed at Bhadradri : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని చెన్నాపురం గ్రామం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఒక మహిళా మావోయిస్టును హత్య చేసి రోడ్డుపై పడేశారు. చాలాకాలంగా మావోయిస్తు దళ సభ్యురాలుగా పని చేస్తున్న నీల్సో(రాధ)గా గుర్తించారు. ఆ మృతదేహం వద్ద మావోయిస్టులు ఒక లేఖను వదిలి వెళ్లారు. ఆ లేఖలో చాలాకాలంగా మావోయిస్టు దళ సభ్యురాలుగా పని చేసిన రాధ గత కొన్ని రోజులుగా పోలీసులకు ఇన్ఫార్మర్గా మారిందని మావోయిస్టులు పేర్కొన్నారు. ఆంధ్ర-ఒడిశా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేశ్ పేరుతో మావోయిస్టులు ఈ లేఖను విడుదల చేశారు. హైదరాబాద్లోని బాలాజీ నగర్కు చెందిన బాలయ్య, బాలమ్మలు కుమార్తె అని లేఖలో రాశారు. 2018లో ఆమె మావోయిస్టు పార్టీలో చేరినట్లు తెలిపారు. ఇన్నేళ్లు పని చేసి పోలీసుల బెదిరింపుల వల్ల ఇన్ఫార్మర్గా మారిందని అందుకే హత్య చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.