ETV Bharat / snippets

'బస్తీలకు సుస్తీ - మంచం పడుతున్న పల్లెలు - అయినా మొద్దు నిద్ర వీడని ప్రభుత్వం'

author img

By ETV Bharat Telangana Team

Published : 7 hours ago

KTR Fire on Govt
KTR Tweet latest (ETV Bharat)

KTR Latest Tweet On Health Department : కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజారోగ్యంపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎవరి చావు వారే చస్తారు, మాకేం సంబంధం అన్నట్టుగా కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జనాలు రోగాలు, నొప్పులు, వ్యాధులతో అల్లాడుతూ ఇళ్లు, ఒళ్లు గుళ్లవుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని మండిపడ్డారు. బస్తీలకు సుస్తీ చేసి, పల్లెలు మంచం పడుతున్నా వైద్యారోగ్య శాఖకు చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారినా, ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదని ఎద్దేవా చేశారు.

KTR Latest Tweet On Health Department : కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజారోగ్యంపై పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఎవరి చావు వారే చస్తారు, మాకేం సంబంధం అన్నట్టుగా కాంగ్రెస్ పాలన సాగుతోందన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జనాలు రోగాలు, నొప్పులు, వ్యాధులతో అల్లాడుతూ ఇళ్లు, ఒళ్లు గుళ్లవుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడని మండిపడ్డారు. బస్తీలకు సుస్తీ చేసి, పల్లెలు మంచం పడుతున్నా వైద్యారోగ్య శాఖకు చీమకుట్టినట్లుగా కూడా లేదన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారినా, ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వీడడం లేదని ఎద్దేవా చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.