ETV Bharat / snippets

దేశంలోనే తొలిసారి కేసీఆర్ హయాంలో రైతుబంధు అమలు చేశాం : కేటీఆర్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 25, 2024, 11:39 AM IST

KTR ON BRS DEVELOPMENT TO FARMERS
KTR Tweet on Farmers (ETV Bharat)

KTR Tweet on Farmers : రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ విప్లవాత్మక పథకాలు అమలు చేశారని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పి ఆ మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాత కోసం పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రైతులకు అందించిన పథకాల వివరాలను ఆయన ట్వీట్ చేశారు. దేశంలోని తొలిసారి కేసీఆర్ హయాంలో రైతుబంధు అమలు చేశామని 70లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్లలను ఖాతాల్లో వేశామన్నారు.

రాష్ట్రంలో ప్రతి రైతుకు రైతుబీమా పేరుతో రూ.5 లక్షలు జీవిత బీమా కల్పించామని కేటీఆర్ తెలిపారు. రూ.25వేల కోట్లతో రుణమాపీ అమలు చేశామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని మిషన్ కాకతీయలో భాగంగా వేల చెరువులను పునరుద్ధరించిన ఘనత కూడా కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ లాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించామని వెల్లడించారు.

KTR Tweet on Farmers : రైతు సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ విప్లవాత్మక పథకాలు అమలు చేశారని బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతు ప్రభుత్వం అని చెప్పి ఆ మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అన్నదాత కోసం పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో రైతులకు అందించిన పథకాల వివరాలను ఆయన ట్వీట్ చేశారు. దేశంలోని తొలిసారి కేసీఆర్ హయాంలో రైతుబంధు అమలు చేశామని 70లక్షల మంది రైతులకు రూ.73 వేల కోట్లలను ఖాతాల్లో వేశామన్నారు.

రాష్ట్రంలో ప్రతి రైతుకు రైతుబీమా పేరుతో రూ.5 లక్షలు జీవిత బీమా కల్పించామని కేటీఆర్ తెలిపారు. రూ.25వేల కోట్లతో రుణమాపీ అమలు చేశామన్నారు. 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని మిషన్ కాకతీయలో భాగంగా వేల చెరువులను పునరుద్ధరించిన ఘనత కూడా కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారామ లాంటి భారీ ప్రాజెక్టులను నిర్మించామని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.