Janmabhoomi Express Service Resumed : తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ను రైల్వే శాఖ మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది. విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనులు చేపట్టడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. నిడదవోలు- కడియం సెక్షన్లో ఆధునికీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ప్రయాణికులకు శుభవార్త - జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు పునరుద్ధరణ
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jun 24, 2024, 7:51 PM IST
![ప్రయాణికులకు శుభవార్త - జన్మభూమి ఎక్స్ప్రెస్ రైలు పునరుద్ధరణ Janmabhoomi Express](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/24-06-2024/1200-675-21786430-thumbnail-16x9-railways.jpg?imwidth=3840)
అయితే రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పునరుద్ధరించాలని విజ్ఞప్తులు రావడంతో తిరిగి విశాఖ- లింగంపల్లి ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ను ఈ నెల 25 నుంచి మామూలుగానే నడపాలని నిర్ణయించింది. జన్మభూమి ఎక్స్ప్రెస్తో పాటు విజయవాడ- కాకినాడ పోర్టు, చెంగల్పట్టు- కాకినాడ పోర్టు రైళ్లను కూడా పునరుద్ధరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Janmabhoomi Express Service Resumed : తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ను రైల్వే శాఖ మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది. విజయవాడ డివిజన్లో ఆధునికీకరణ పనులు చేపట్టడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. నిడదవోలు- కడియం సెక్షన్లో ఆధునికీకరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో జూన్ 23 నుంచి ఆగస్టు 11 వరకు జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
అయితే రైళ్ల రద్దుతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పునరుద్ధరించాలని విజ్ఞప్తులు రావడంతో తిరిగి విశాఖ- లింగంపల్లి ఎక్స్ప్రెస్ను ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. జన్మభూమి ఎక్స్ప్రెస్ను ఈ నెల 25 నుంచి మామూలుగానే నడపాలని నిర్ణయించింది. జన్మభూమి ఎక్స్ప్రెస్తో పాటు విజయవాడ- కాకినాడ పోర్టు, చెంగల్పట్టు- కాకినాడ పోర్టు రైళ్లను కూడా పునరుద్ధరిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.