KTR Latest Tweet on Runamafi : నాగర్ కర్నూల్ జిల్లా పెంటవెల్లిలో 499 మంది రైతుల్లో ఒక్కరికి కూడా రుణమాఫీ కాకపోవటం శోచనీయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రుణమాఫీ పూర్తి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం మాటలు బూటకం అని చెప్పటానికి ఇది సజీవ సాక్ష్యమని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
డిసెంబర్ నుంచి 15 ఆగస్టు దాకా డెడ్ లైన్లు పెట్టిన సీఎం, ఇప్పటి వరకు వీరికి రుణమాఫీ ఎందుకు కాలేదో సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పావు శాతం కూడా మాఫీ చేయకుండా వందశాతం అయిపోయినట్టు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇకనైనా వెంటనే పెంట్లవెల్లి రైతుల గోడు తీర్చాలని కోరారు.