Excise Department Officials Raid in Pubs : హైదరాబాద్లో డ్రగ్స్పై అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నా, రోజురోజుకూ డ్రగ్స్ ముఠాలు విజృంభిస్తున్నాయి. నగరంలో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు కలకలం సృష్టిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా పలు పబ్బుల్లో విక్రయాలు జరుపుతున్నారనే సమాచారం రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ పోలీసులు ఐదు పబ్బుల్లో దాడులు నిర్వహించారు.
మొత్తం 37 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా, వారిలో నలుగురికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు తేల్చారు. మిగలిన 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్తో శాంపిల్స్ తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.