ETV Bharat / snippets

రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ఫోకస్ - కర్ణాటక రెవెన్యూ మంత్రితో ధరణి కమిటీ భేటీ

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 5, 2024, 7:43 PM IST

Dharani Committee Visits Karnataka
Dharani Committee Visits Karnataka (ETV Bharat)

Dharani Committee Visits Karnataka : తెలంగాణలో భూసమస్యల శాశ్వత పరిష్కారానికి అవసరమైన చట్టాలను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ధరణి కమిటీ సభ్యులు ఇవాళ కర్ణాటక రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడను ధరణి కమిటీ సభ్యులు కలిశారు. బెంగళూరులో అక్కడ రెవెన్యూ మంత్రిని కలిసిన కోదండ రెడ్డి, భూ నిపుణులు సునీల్‌ ఆ రాష్ట్రంలో అమలవుతున్న చట్టాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి సభ్యులు, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, భూచట్టాల నిపుణుడు న్యాయవాది సునీల్‌ కర్ణాటక మంత్రితో సమావేశమై అనేక సమస్యలపై చర్చించారు. 20 ఏళ్లుగా భూసర్వే పూర్తి చేసుకుని సమస్యలు ఉత్పన్నం కాకుండా రిజిస్ట్రేషన్‌ సమయంలోనే సబంధిత ఆస్తి మ్యాప్‌ కూడా పొందుపర్చనున్నట్లుగా తెలిపారు. అదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.

Dharani Committee Visits Karnataka : తెలంగాణలో భూసమస్యల శాశ్వత పరిష్కారానికి అవసరమైన చట్టాలను తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ధరణి కమిటీ సభ్యులు ఇవాళ కర్ణాటక రాష్ట్రానికి వెళ్లారు. అక్కడ రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడను ధరణి కమిటీ సభ్యులు కలిశారు. బెంగళూరులో అక్కడ రెవెన్యూ మంత్రిని కలిసిన కోదండ రెడ్డి, భూ నిపుణులు సునీల్‌ ఆ రాష్ట్రంలో అమలవుతున్న చట్టాలను అడిగి తెలుసుకున్నారు. ధరణి సభ్యులు, కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, భూచట్టాల నిపుణుడు న్యాయవాది సునీల్‌ కర్ణాటక మంత్రితో సమావేశమై అనేక సమస్యలపై చర్చించారు. 20 ఏళ్లుగా భూసర్వే పూర్తి చేసుకుని సమస్యలు ఉత్పన్నం కాకుండా రిజిస్ట్రేషన్‌ సమయంలోనే సబంధిత ఆస్తి మ్యాప్‌ కూడా పొందుపర్చనున్నట్లుగా తెలిపారు. అదే విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.