Deputy CM Bhatti Vikramarka Election Campaign in Punjab : దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రతి ఇంటి పెద్దకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయల నగదు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మహిళలను మహారాణులుగా చేస్తామని చెప్పారు. మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కొట్కపుర అసెంబ్లీ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. గత వారం రోజులుగా ఫరీద్ కోట్ లోక్సభ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు కోటక్ పుర ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.
పంజాబ్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి - గత వారం రోజులుగా అక్కడే మకాం
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : May 28, 2024, 9:34 PM IST
![పంజాబ్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి - గత వారం రోజులుగా అక్కడే మకాం Deputy CM Bhatti Vikramarka Election Campaign in Punjab](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-05-2024/1200-675-21581369-thumbnail-16x9-bhatti.jpg?imwidth=3840)
Deputy CM Bhatti Vikramarka Election Campaign in Punjab : దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే ప్రతి ఇంటి పెద్దకు సంబంధించిన బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయల నగదు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మహిళలను మహారాణులుగా చేస్తామని చెప్పారు. మంగళవారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కొట్కపుర అసెంబ్లీ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో భట్టి విక్రమార్క పాల్గొని ప్రసంగించారు. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పాల్గొన్నారు. గత వారం రోజులుగా ఫరీద్ కోట్ లోక్సభ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు కోటక్ పుర ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు.