CM Revanth To Visit US and South Korea : పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్రెడ్డి బృందం శనివారం రోజున అమెరికా వెళ్లుతోంది. ఈనెల 3న తెల్లవారుజామున సీఎం రేవంత్ రెడ్డి, ఐటీశాఖ మంత్రి శ్రీధర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణరావు, జయేశ్రంజన్, ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది, తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్దన్రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, దిల్లీ ప్రభుత్వ పీఆర్వో ఉదయ్రెడ్డిలతోపాటు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్రెడ్డిలు అమెరికా వెళ్లుతున్నట్లు సమాచారం.
అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, శాన్ప్రాన్సిస్కో, దక్షిణ కొరియాలోని సియోల్ తదితర ప్రాంతాల్లో సీఎం బృందం పర్యటించనుంది. మూడో తేదీ శనివారం తెల్లవారుజామున 3.45 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి బయలుదేరతారు. ఎనిమిది రోజులపాటు అమెరికాలో, రెండు రోజులు దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. తిరిగి ఈ నెల 14వ హైదరాబాద్కు చేరుకోనున్నారు.