CM Revanth Reddy Wishes Group1 Candidates : గ్రూప్ - 1 మెయిన్స్కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 21 - 27 మధ్య జరిగే మెయిన్స్ పరీక్షల్లో కూడా వారు విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రాథమిక పరీక్షలో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని సూచించారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్ధేశించుకోవడం దాని కోసం ప్రయత్నించడం.. విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం ఒక వ్యాపకంగా పెట్టుకున్న వారు ఎప్పటికైనా విజయతీరాలను చేరుతారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
గ్రూప్-1 మెయిన్స్కు అర్హత సాధించిన 31,382 అభ్యర్థులు - శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్
Published : Jul 7, 2024, 3:48 PM IST
CM Revanth Reddy Wishes Group1 Candidates : గ్రూప్ - 1 మెయిన్స్కు అర్హత సాధించిన 31,382 మంది అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అక్టోబర్ 21 - 27 మధ్య జరిగే మెయిన్స్ పరీక్షల్లో కూడా వారు విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రాథమిక పరీక్షలో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడవద్దని సూచించారు. జీవితంలో లక్ష్యాన్ని నిర్ధేశించుకోవడం దాని కోసం ప్రయత్నించడం.. విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం ఒక వ్యాపకంగా పెట్టుకున్న వారు ఎప్పటికైనా విజయతీరాలను చేరుతారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.