ETV Bharat / snippets

నష్ట పరిహారం అంచనా కోసం మంత్రుల కమిటీ ఏర్పాటు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 10:37 PM IST

cabinet committee
cabinet committee (ETV Bharat)

Cabinet Committee on Floods Enumeration: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో వరదలు, నష్ట పరిహారం అంచనా, సహాయ చర్యల పర్యవేక్షణ కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, పురపాలక శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్​లు కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియ పర్యవేక్షణ, వరద ముంపు నివారణ చర్యలు తదితర అంశాలపై మంత్రులు కమిటీ సిఫార్సులు చేయనుంది. మంత్రుల కమిటీకి కన్వీనర్‌గా రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఉండనున్నారు. మరోవైపు విజయవాడ వరద ముంపు సహాయ చర్యలు, శానిటేషన్ పర్యవేక్షణ కోసం ప్రత్యేకాధికారిగా కె.కన్నబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శానిటేషన్ పర్యవేక్షణ చేస్తున్న హరినారాయణ స్థానంలో కన్నబాబును నియమిస్తూ ఆదేశాలిచ్చింది.

Cabinet Committee on Floods Enumeration: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో వరదలు, నష్ట పరిహారం అంచనా, సహాయ చర్యల పర్యవేక్షణ కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, పురపాలక శాఖ మంత్రి నారాయణ, హోం మంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్​లు కమిటీ సభ్యులుగా ఉండనున్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియ పర్యవేక్షణ, వరద ముంపు నివారణ చర్యలు తదితర అంశాలపై మంత్రులు కమిటీ సిఫార్సులు చేయనుంది. మంత్రుల కమిటీకి కన్వీనర్‌గా రాష్ట్ర రెవెన్యూ, విపత్తుల నిర్వహణ ప్రత్యేక కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఉండనున్నారు. మరోవైపు విజయవాడ వరద ముంపు సహాయ చర్యలు, శానిటేషన్ పర్యవేక్షణ కోసం ప్రత్యేకాధికారిగా కె.కన్నబాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శానిటేషన్ పర్యవేక్షణ చేస్తున్న హరినారాయణ స్థానంలో కన్నబాబును నియమిస్తూ ఆదేశాలిచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.