ETV Bharat / snippets

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహార బాధ్యులపై చర్యలు తీసుకోవాలని - రేపు ధర్నాచౌక్‌ వద్ద బీజేపీ ధర్నా

author img

By ETV Bharat Telangana Team

Published : May 30, 2024, 7:11 PM IST

BJP Dharna at Indira Park Tomorrow
BJP Dharna at Indira Park Tomorrow (ETV Bharat)

BJP Dharna at Indira Park Tomorrow : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహార బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద బీజేపీ ధర్నా చేపట్టనుంది. ఎంపీ లక్ష్మణ్‌ నేతృత్వంలో రేపు ఉదయం 11 గంటలకు ధర్నా నిర్వహించనుంది. కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని వాంగ్మూలం ఉన్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తోంది. బీఎల్‌ సంతోష్‌ను లక్ష్యంగా చేయడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని ధర్నాచౌక్‌ వేదికగా బీజేపీ డిమాండ్‌ చేయనుంది.

BJP Dharna at Indira Park Tomorrow : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహార బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద బీజేపీ ధర్నా చేపట్టనుంది. ఎంపీ లక్ష్మణ్‌ నేతృత్వంలో రేపు ఉదయం 11 గంటలకు ధర్నా నిర్వహించనుంది. కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగిందని వాంగ్మూలం ఉన్నప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం కీలక వ్యక్తులపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తోంది. బీఎల్‌ సంతోష్‌ను లక్ష్యంగా చేయడంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆగ్రహంతో ఉంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసును సీబీఐకి అప్పగించాలని ధర్నాచౌక్‌ వేదికగా బీజేపీ డిమాండ్‌ చేయనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.