Bharat Biotech Donates 1crore To Telangana CMRF : భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన రాష్ట్రానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు బాసటగా మేమున్నామంటూ మానవతావాదులు, పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చిన భారత్ బయోటెక్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన భారత్ బయోటెక్ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల కోటి రూపాయల చెక్కును అందచేశారు. మరోవైపు రిలయన్స్ ఫౌండేషన్ ఏకంగా 20 కోట్ల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. నీతా అంబానీ తరపున రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేశారు.
తెలంగాణ సీఎంఆర్ఎఫ్కు భారత్ బయోటెక్ రూ.కోటి విరాళం
Published : 4 hours ago
Bharat Biotech Donates 1crore To Telangana CMRF : భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన రాష్ట్రానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. బాధితులకు బాసటగా మేమున్నామంటూ మానవతావాదులు, పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకువచ్చిన భారత్ బయోటెక్ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన భారత్ బయోటెక్ కంపెనీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల కోటి రూపాయల చెక్కును అందచేశారు. మరోవైపు రిలయన్స్ ఫౌండేషన్ ఏకంగా 20 కోట్ల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. నీతా అంబానీ తరపున రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేశారు.