AP CM Chandrababu Take Request from Public : ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలపై యంత్రాంగం జోరుగా ముందుకు కదులుతోంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సైతం నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఏపీలోని మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి సామాన్య ప్రజల్ని, కార్యకర్తలను కలిసేందుకు సమయం కేటాయిస్తానని ఆయన ఇదివరకే తెలిపారు.
ప్రజల దగ్గరి నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన ఏపీ సీఎం చంద్రబాబు
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jun 23, 2024, 10:22 AM IST
![ప్రజల దగ్గరి నుంచి స్వయంగా వినతులు స్వీకరించిన ఏపీ సీఎం చంద్రబాబు AP CM Chandrababu Take Request from Public](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/23-06-2024/1200-675-21775394-thumbnail-16x9-chandra-babu.jpg?imwidth=3840)
ఇందులో భాగంగా కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి, వందల మంది ప్రజలు వారి సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారు. సీఎం ప్రజా సమస్యలను స్వీకరిస్తారని తెలిసి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. జనం దగ్గరకే చంద్రబాబు స్వయంగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. పింఛన్ల పెంపుపై పలువురు వృద్దులు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు. దివ్యాంగులు తమకు సాయం చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించారు.
AP CM Chandrababu Take Request from Public : ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజా సమస్యలపై యంత్రాంగం జోరుగా ముందుకు కదులుతోంది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు సైతం నేరుగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఏపీలోని మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి సామాన్య ప్రజల్ని, కార్యకర్తలను కలిసేందుకు సమయం కేటాయిస్తానని ఆయన ఇదివరకే తెలిపారు.
ఇందులో భాగంగా కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి, వందల మంది ప్రజలు వారి సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చారు. సీఎం ప్రజా సమస్యలను స్వీకరిస్తారని తెలిసి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. జనం దగ్గరకే చంద్రబాబు స్వయంగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. పింఛన్ల పెంపుపై పలువురు వృద్దులు సీఎంకు ధన్యవాదాలు చెప్పారు. దివ్యాంగులు తమకు సాయం చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించారు.