ETV Bharat / snippets

రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పర్వతగిరి ఎస్సై

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 2, 2024, 6:24 PM IST

acb raids in parvathagiri police station in warangal
ACB Arrested Parvathagiri SI In Warangal (ETV Bharat)

ACB Arrested Parvathagiri SI In Warangal : వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్​పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎస్సై గూగులోతు వెంకన్న బదావత్, భాస్కర్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఇటీవల గుడుంబా తయారీ కోసం ఓ వాహనంలో బెల్లం తరలిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకొని పలువురిపై కేసు నమోదు చేశారు.

ఈ కేసు విషయంలో పట్టుబడ్డ వాహనానికి స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుందని, అందుకు రూ.70 వేలు ఇవ్వాలని బాధితుడికి ఎస్సై తెలిపాడు. తొలుత రూ.20 వేలు ఫోన్ పే ద్వారా ఎస్సైకి చెల్లించగా, మరో రూ.40 వేలు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీనికి సహకరించిన పోలీస్ వాహన డ్రైవర్​ సదానందాన్ని సైతం అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ACB Arrested Parvathagiri SI In Warangal : వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్​పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎస్సై గూగులోతు వెంకన్న బదావత్, భాస్కర్ అనే వ్యక్తి వద్ద నుంచి రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఇటీవల గుడుంబా తయారీ కోసం ఓ వాహనంలో బెల్లం తరలిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకొని పలువురిపై కేసు నమోదు చేశారు.

ఈ కేసు విషయంలో పట్టుబడ్డ వాహనానికి స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సి ఉంటుందని, అందుకు రూ.70 వేలు ఇవ్వాలని బాధితుడికి ఎస్సై తెలిపాడు. తొలుత రూ.20 వేలు ఫోన్ పే ద్వారా ఎస్సైకి చెల్లించగా, మరో రూ.40 వేలు ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. దీనికి సహకరించిన పోలీస్ వాహన డ్రైవర్​ సదానందాన్ని సైతం అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.