ETV Bharat / snippets

రికార్డు సృష్టించిన టెన్నిస్ స్టార్లు- ఒలింపిక్స్​ చరిత్రలోనే తొలిసారి!

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 31, 2024, 6:22 PM IST

Olympics Table Tennis India
Olympics Table Tennis India (Source: Associated Press)

Olympics Table Tennis India: పారిస్ ఒలింపిక్స్​ 2024లో టేబుల్ టెన్నిస్ స్టార్లు మనీకా బాత్రా, ఆకుల శ్రీజ రికార్డు సృష్టించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్​ టేబుల్ టెన్నిస్ వేర్వేరు పోటీల్లో మనీకా, శ్రీజ విజయం సాధించి ప్రీ క్వార్టర్స్​కు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఒలింపిక్స్​ టేబుల్ టెన్నిస్​లో ప్రీ క్వార్టర్​ ఫైనల్స్​కు అర్హత సాధించిన అథ్లెట్లుగా రికార్డు సృష్టించారు. ముందుగా మనికా బాత్ర 4-0 తేడాతో ప్రతీక (ఫ్రెంచ్)పై విజయం సాధించి ఈ ఘనత అందుకున్న తొలి భారత మహిళా అథ్లెట్​గా రికార్డు కొట్టింది.

అనంతరం తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ సెర్బియన్ ప్లేయర్ జియాన్ జెంగ్​పై 4-2 తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ప్రీ క్వార్టర్స్​కు ఎంపికైన రెండో భారత మహిళా అథ్లెట్​గా నిలిచింది. కాగా, ఒలింపిక్స్​ చరిత్రలో టెబుల్ టెన్నిస్​లో ఇప్పటిదాకా ఒక్క భారత అథ్లెట్​ కూడా ప్రీ క్వార్టర్స్​కు చేరుకోలేదు.

Olympics Table Tennis India: పారిస్ ఒలింపిక్స్​ 2024లో టేబుల్ టెన్నిస్ స్టార్లు మనీకా బాత్రా, ఆకుల శ్రీజ రికార్డు సృష్టించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్​ టేబుల్ టెన్నిస్ వేర్వేరు పోటీల్లో మనీకా, శ్రీజ విజయం సాధించి ప్రీ క్వార్టర్స్​కు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఒలింపిక్స్​ టేబుల్ టెన్నిస్​లో ప్రీ క్వార్టర్​ ఫైనల్స్​కు అర్హత సాధించిన అథ్లెట్లుగా రికార్డు సృష్టించారు. ముందుగా మనికా బాత్ర 4-0 తేడాతో ప్రతీక (ఫ్రెంచ్)పై విజయం సాధించి ఈ ఘనత అందుకున్న తొలి భారత మహిళా అథ్లెట్​గా రికార్డు కొట్టింది.

అనంతరం తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ సెర్బియన్ ప్లేయర్ జియాన్ జెంగ్​పై 4-2 తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ప్రీ క్వార్టర్స్​కు ఎంపికైన రెండో భారత మహిళా అథ్లెట్​గా నిలిచింది. కాగా, ఒలింపిక్స్​ చరిత్రలో టెబుల్ టెన్నిస్​లో ఇప్పటిదాకా ఒక్క భారత అథ్లెట్​ కూడా ప్రీ క్వార్టర్స్​కు చేరుకోలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.