Olympics Table Tennis India: పారిస్ ఒలింపిక్స్ 2024లో టేబుల్ టెన్నిస్ స్టార్లు మనీకా బాత్రా, ఆకుల శ్రీజ రికార్డు సృష్టించారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ టేబుల్ టెన్నిస్ వేర్వేరు పోటీల్లో మనీకా, శ్రీజ విజయం సాధించి ప్రీ క్వార్టర్స్కు దూసుకెళ్లారు. ఈ క్రమంలో ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్లో ప్రీ క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించిన అథ్లెట్లుగా రికార్డు సృష్టించారు. ముందుగా మనికా బాత్ర 4-0 తేడాతో ప్రతీక (ఫ్రెంచ్)పై విజయం సాధించి ఈ ఘనత అందుకున్న తొలి భారత మహిళా అథ్లెట్గా రికార్డు కొట్టింది.
అనంతరం తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ సెర్బియన్ ప్లేయర్ జియాన్ జెంగ్పై 4-2 తేడాతో నెగ్గింది. ఈ విజయంతో ప్రీ క్వార్టర్స్కు ఎంపికైన రెండో భారత మహిళా అథ్లెట్గా నిలిచింది. కాగా, ఒలింపిక్స్ చరిత్రలో టెబుల్ టెన్నిస్లో ఇప్పటిదాకా ఒక్క భారత అథ్లెట్ కూడా ప్రీ క్వార్టర్స్కు చేరుకోలేదు.