Telangana Congress CLP Meeting in Hyderabad : తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ సమావేశం ఇవాళ సాయంత్రం జరగనుంది. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ సమావేశం జరగనుంది. సాయంత్రం 7 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఇందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్విని సీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు పరిచయం చేస్తారు. అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉంది.
ప్రధానంగా సింఘ్వి ఒక్కరే నామినేషన్ వేసినట్లయితే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు. కానీ కేశవ రావు రాజీమానామాతో ఖాళీ అయిన స్థానం కావడంతో బీఆర్ఎస్ నుంచి అభ్యర్ధిని నిలబెట్టినట్లయితే కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చించే అవకాశం ఉందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి సోమవారం నామినేషన్ వేసే అవకాశం ఉంది.