ETV Bharat / snippets

పోచారం ఇంట్లో పొలిటికల్ డిన్నర్ - హాజరైన సీఎం రేవంత్

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 8:22 AM IST

Dinner Meet At Pocharam Home
Dinner Meet At Pocharam Home (ETV Bharat)

CM Revanth Attended Dinner At Pocharam Home : కాంగ్రెస్‌లో ఇటీవలే చేరిన మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన నివాసంలో విందు సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి సహా ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్న 10మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల్లో 9మంది మాత్రమే ఈ భేటీకి హాజరైనట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

గద్వాల్‌ ఎమ్మెల్యే బి.కృష్ణమోహన్‌ రెడ్డి హాజరుకాలేదని పేర్కొన్నాయి. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కృష్ణమోహన్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్​ ఎల్పీ నేత ఛాంబర్‌కు వెళ్లి ఆ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్​, హరీశ్‌రావులను కలిశారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్​ను కూడా కలువనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు.

CM Revanth Attended Dinner At Pocharam Home : కాంగ్రెస్‌లో ఇటీవలే చేరిన మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన నివాసంలో విందు సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి సహా ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. అయితే కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్న 10మంది బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేల్లో 9మంది మాత్రమే ఈ భేటీకి హాజరైనట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

గద్వాల్‌ ఎమ్మెల్యే బి.కృష్ణమోహన్‌ రెడ్డి హాజరుకాలేదని పేర్కొన్నాయి. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన కృష్ణమోహన్‌రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్​ ఎల్పీ నేత ఛాంబర్‌కు వెళ్లి ఆ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్​, హరీశ్‌రావులను కలిశారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్​ను కూడా కలువనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.