Nigeria Tanker Blast : నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి100మందికి పైగా మృతిచెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. జిగావా రాష్ట్రంలోని మజియా పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల కనో నుంచి బయల్దేరిన పెట్రోల్ ట్యాంకర్ హైవేపై బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది స్థానికులు ఇంధనం కోసం ట్యాంకర్ వద్దకు వెళ్లారు. వారు పెట్రోల్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. ట్యాంకర్కు దూరంగా ఉండమని ప్రజలను హెచ్చరించినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదని, ఒక్కసారిగా ఎగబడటం వల్ల మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు చెబుతున్నారు.
ట్యాంకర్ బోల్తా- పెట్రోల్ తీసుకుందామని వెళ్లి 100మందికి పైగా మృతి
Published : 5 hours ago
|Updated : 5 hours ago
Nigeria Tanker Blast : నైజీరియాలో పెట్రోల్ ట్యాంకర్ పేలి100మందికి పైగా మృతిచెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. జిగావా రాష్ట్రంలోని మజియా పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల కనో నుంచి బయల్దేరిన పెట్రోల్ ట్యాంకర్ హైవేపై బోల్తా పడింది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది స్థానికులు ఇంధనం కోసం ట్యాంకర్ వద్దకు వెళ్లారు. వారు పెట్రోల్ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగి ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. ట్యాంకర్కు దూరంగా ఉండమని ప్రజలను హెచ్చరించినప్పటికీ ఎవరూ వినిపించుకోలేదని, ఒక్కసారిగా ఎగబడటం వల్ల మృతుల సంఖ్య భారీగా ఉందని అధికారులు చెబుతున్నారు.