Music Director Thaman Update on Prabhas Raja Saab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాజాసాబ్. అయితే తాజాగా ఈ మూవీ మ్యూజిక్పై సంగీత దర్శకుడు తమన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇది కమర్షియల్ ఆల్బమ్ అని తెలిపారు. నగరంలో తాజాగా నిర్వహించిన ఓ మ్యూజికల్ ఈవెంట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి రాజాసాబ్ చిత్ర దర్శకుడు మారుతితో కలిసి తమన్ హాజరయ్యారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
"కల్కితో ప్రభాస్ బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. దీంతో మాపై కాస్త ఒత్తిడి ఎక్కువైంది. అయితే, ఇది కమర్షియల్ ఆల్బమ్ కావడం మాకు ఉపశమనం. ఇందులో డ్యాన్స్కు ప్రాధాన్యమున్న సాంగ్స్ ఉన్నాయి. ఆ విషయంలో మునుపటి ప్రభాస్ సర్ను చూస్తుండడం నాకు సంతోషంగా ఉంది" అని చెప్పారు. కాగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీవిశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు