ETV Bharat / snippets

దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం- 9మంది దుర్మరణం

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 10:42 PM IST

Road Accident In Rajasthan Today
Road Accident In Rajasthan Today (ETV Bharat)

Road Accident In Rajasthan Today : రాజస్థాన్​లోని కరౌలీ జిల్లాలో కారు, ట్రక్కు ఢీకొని ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు సహా 9మంది మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మాండ్రాయల్ టౌన్​లోని దుండపుర క్రాసింగ్​ వద్ద ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. కరౌలీలోని కైలదేవి ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగిందని, మృతులంతా మాండ్రాయల్​కు చెందివ వారని చెప్పారు. వారంతా బంధువులని తెలిపారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కరౌలీ జిల్లా కలెక్టర్ నీలభ్ సక్సేనా, ఎస్​పీ బ్రిజేష్ జ్యోతి ఉపాధ్యాయ్, అదనపు జిల్లా కలెక్టర్ రాజ్‌వీర్ సింగ్ చౌదరి, కరౌలీ పోలీస్ స్టేషన్ అధికారి సునీల్ సింగ్, వైద్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనపై అధికారులు సమాచారం తీసుకున్నారు.

Road Accident In Rajasthan Today : రాజస్థాన్​లోని కరౌలీ జిల్లాలో కారు, ట్రక్కు ఢీకొని ఆరుగురు మహిళలు, ఇద్దరు పిల్లలు సహా 9మంది మృతి చెందారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మాండ్రాయల్ టౌన్​లోని దుండపుర క్రాసింగ్​ వద్ద ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. కరౌలీలోని కైలదేవి ఆలయంలో పూజలు నిర్వహించి తిరిగివస్తుండగా ఈ ఘటన జరిగిందని, మృతులంతా మాండ్రాయల్​కు చెందివ వారని చెప్పారు. వారంతా బంధువులని తెలిపారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న కరౌలీ జిల్లా కలెక్టర్ నీలభ్ సక్సేనా, ఎస్​పీ బ్రిజేష్ జ్యోతి ఉపాధ్యాయ్, అదనపు జిల్లా కలెక్టర్ రాజ్‌వీర్ సింగ్ చౌదరి, కరౌలీ పోలీస్ స్టేషన్ అధికారి సునీల్ సింగ్, వైద్య శాఖ ఉన్నతాధికారులు జిల్లా ఆసుపత్రికి చేరుకున్నారు. ఘటనపై అధికారులు సమాచారం తీసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.