Priyanka Gandhi Nomination : కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నామినేషన్కు ముందు ప్రియాంక గాంధీ పార్టీ అధ్యక్షుడితో సమావేశమయ్యారు. ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
2024 లోక్సభ ఎన్నికల్లో వయనాడ్, ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. రెండు చోట్ల విజయం సాధించారు. రాయ్బరేలీ సీటును తన వద్దే ఉంచుకుని, వయనాడ్ ఎంపీగా రాజీనామా చేశారు. దీంతో ఆ స్థానంలో ప్రియాంక గాంధీని యూడీఎఫ్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దింపింది. ఝార్ఖండ్ అసెంబ్లీకి తొలి దశ పోలింగ్తో పాటు వయనాడ్ పార్లమెంట్ స్థానం, 47 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.