ETV Bharat / international

'3 నిమిషాలు మాత్రమే కౌగిలించుకోండి!'- హెచ్చరిక బోర్డులు పెట్టిన న్యూజిలాండ్- ఎందుకో తెలుసా?

ఎయిర్‌పోర్టుల్లో సెండాఫ్​ కౌగిలింతలపై న్యూజిలాండ్ ఆంక్షలు- గరిష్టంగా 3 నిమిషాల్లో వీడ్కోలు ముగించండని హెచ్చరిక బోర్డులు

New Zealand Hug Restrictions
New Zealand Hug Restrictions (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

New Zealand Hug Restrictions : ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలలో భావోద్వేగ వీడ్కోలు సర్వ సాధారణం. ఆత్మీయులను సాగనంపడానికి కుటుంబసభ్యులు ఎయిర్‌పోర్టులకు వెళ్తుంటారు. అయితే ఈ వీడ్కోలు కార్యక్రమాలే న్యూజిలాండ్‌లోని డునెడిన్ ఎయిర్‌పోర్టుకు తలనొప్పిగా మారాయి. ప్రయాణికుల బంధుమిత్రులు గంటల కొద్దీ విమానాశ్రయంలోనే ఉంటున్నారు. వారిని కౌగిలించుకొని భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ కారణంగా డునెడిన్ ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.

రద్దీ సమస్యను పరిష్కరించేందుకు విమానాశ్రయం డ్రాప్-ఆఫ్ ప్రాంతంలో అధికారులు కాల పరిమితిని విధించారు. వీడ్కోలు చెప్పడం కష్టమే, కానీ గరిష్టంగా 3 నిమిషాల్లో ముగించండని అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు. విమానాశ్రయం వెలుపల రీడిజైన్ చేసిన ప్యాసింజర్ డ్రాప్-ఆఫ్ ప్రాంతంలో సెప్టెంబర్‌ నుంచి దీనిని అమలు చేస్తున్నట్టు CEO డాన్‌ డి బోనో తెలిపారు. వీడ్కోలు ఆలింగనాలతో పలు ఎయిర్‌పోర్టులలో వాహనాలకు జరిమానాలు పడుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

ఈ హెచ్చరిక బోర్డు వల్ల అలాంటి వాటి నుంచి బయటపడొచ్చని చెప్పారు. నిజానికి 20 సెకన్లు ఏ వ్యక్తినయినా హగ్‌ చేసుకుంటే సరిపోతుందని డాన్‌ డి బోనో తెలిపారు. 3 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండాలనుకుంటే పార్కింగ్ స్థలానికి వెళ్లి 15 నిమిషాల వరకు ఉండొచ్చని చెప్పారు. అందుకు వాహనాలకు ఎలాంటి ఛార్జీలు విధించమని పేర్కొన్నారు.

New Zealand Hug Restrictions : ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాలలో భావోద్వేగ వీడ్కోలు సర్వ సాధారణం. ఆత్మీయులను సాగనంపడానికి కుటుంబసభ్యులు ఎయిర్‌పోర్టులకు వెళ్తుంటారు. అయితే ఈ వీడ్కోలు కార్యక్రమాలే న్యూజిలాండ్‌లోని డునెడిన్ ఎయిర్‌పోర్టుకు తలనొప్పిగా మారాయి. ప్రయాణికుల బంధుమిత్రులు గంటల కొద్దీ విమానాశ్రయంలోనే ఉంటున్నారు. వారిని కౌగిలించుకొని భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ కారణంగా డునెడిన్ ఎయిర్‌పోర్టులో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.

రద్దీ సమస్యను పరిష్కరించేందుకు విమానాశ్రయం డ్రాప్-ఆఫ్ ప్రాంతంలో అధికారులు కాల పరిమితిని విధించారు. వీడ్కోలు చెప్పడం కష్టమే, కానీ గరిష్టంగా 3 నిమిషాల్లో ముగించండని అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టారు. విమానాశ్రయం వెలుపల రీడిజైన్ చేసిన ప్యాసింజర్ డ్రాప్-ఆఫ్ ప్రాంతంలో సెప్టెంబర్‌ నుంచి దీనిని అమలు చేస్తున్నట్టు CEO డాన్‌ డి బోనో తెలిపారు. వీడ్కోలు ఆలింగనాలతో పలు ఎయిర్‌పోర్టులలో వాహనాలకు జరిమానాలు పడుతున్నాయని ఆయన గుర్తు చేశారు.

ఈ హెచ్చరిక బోర్డు వల్ల అలాంటి వాటి నుంచి బయటపడొచ్చని చెప్పారు. నిజానికి 20 సెకన్లు ఏ వ్యక్తినయినా హగ్‌ చేసుకుంటే సరిపోతుందని డాన్‌ డి బోనో తెలిపారు. 3 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండాలనుకుంటే పార్కింగ్ స్థలానికి వెళ్లి 15 నిమిషాల వరకు ఉండొచ్చని చెప్పారు. అందుకు వాహనాలకు ఎలాంటి ఛార్జీలు విధించమని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.