NSA Ajit Doval Appointment : జాతీయ భద్రతా సలహాదారు(NSA)గా అజిత్ డోభాల్ను తిరిగి నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వరుసగా మూడోసారి డోభాల్ను NSAగా కేంద్రం నియమించింది. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా విశ్రాంత IAS అధికారి పీకే మిశ్రను మళ్లీ నియమించారు. ఈ మేరకు మిశ్ర పునర్నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. వీరిద్దరి పదవీకాలం ప్రధాని పదవీకాలంతో సమానంగా ఉంటుందని లేదా తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి సలహాదారులుగా అమిత్ ఖరే, తరుణ్ కపూర్ను రెండేళ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ కార్యదర్శి హోదా వీరికి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 10 నుంచే వీరందరి నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
అజిత్ డోభాల్ ఆన్ డ్యూటీ- NSAగా మరోసారి నియామకం
Published : Jun 13, 2024, 5:57 PM IST
NSA Ajit Doval Appointment : జాతీయ భద్రతా సలహాదారు(NSA)గా అజిత్ డోభాల్ను తిరిగి నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వరుసగా మూడోసారి డోభాల్ను NSAగా కేంద్రం నియమించింది. ఆయనకు కేబినెట్ మంత్రి హోదా ఉంటుందని స్పష్టం చేసింది. ఇక ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా విశ్రాంత IAS అధికారి పీకే మిశ్రను మళ్లీ నియమించారు. ఈ మేరకు మిశ్ర పునర్నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. వీరిద్దరి పదవీకాలం ప్రధాని పదవీకాలంతో సమానంగా ఉంటుందని లేదా తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతారని ప్రభుత్వం పేర్కొంది. ఇదే సమయంలో ప్రధానమంత్రి సలహాదారులుగా అమిత్ ఖరే, తరుణ్ కపూర్ను రెండేళ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ కార్యదర్శి హోదా వీరికి ఉంటుందని ఆదేశాల్లో పేర్కొంది. జూన్ 10 నుంచే వీరందరి నియామకం అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.