Fire Accident In Mumbai : ముంబయి చెంబూరులోని సిద్ధార్థ నగర్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. అందులో ఒకే ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన మరో ఐదుగురు ఉన్నారని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది. బీఎంసీ తెలిపిన వివరాల ప్రకారం, కాలనీలోని ఓ రెండంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న షాప్లో తెల్లవారుజామున 5.20 గంటలకు మంటలు చెలరేగాయి. వైరింగ్ కనెక్షన్లు ఉండటం వల్ల మంటలు పై పోర్షన్కు వ్యాపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఏడుగురు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. షాప్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు.
రెండంతస్తుల భవనంలో మంటలు- ఏడుగురు మృతి
Published : 3 hours ago
|Updated : 3 hours ago
Fire Accident In Mumbai : ముంబయి చెంబూరులోని సిద్ధార్థ నగర్ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. అందులో ఒకే ముగ్గురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన మరో ఐదుగురు ఉన్నారని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది. బీఎంసీ తెలిపిన వివరాల ప్రకారం, కాలనీలోని ఓ రెండంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న షాప్లో తెల్లవారుజామున 5.20 గంటలకు మంటలు చెలరేగాయి. వైరింగ్ కనెక్షన్లు ఉండటం వల్ల మంటలు పై పోర్షన్కు వ్యాపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఏడుగురు మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. షాప్లో షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే మంటలు చెలరేగాయని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించారు.