ETV Bharat / snippets

పాకిస్థాన్‌లో భూకంపం - దిల్లీలో స్వల్ప ప్రకంపనలు

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2024, 2:12 PM IST

Earthquake in Delhi
Earthquake in Delhi (ANI)

Earthquake in Delhi : దిల్లీలో స్వల్పంగా భూప్రంపనలు సంభవించాయి. పాకిస్థాన్​లో వచ్చిన భూకంపం కారణంగానే దిల్లీ, ఎన్​సీఆర్​ పరిధిలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే భూకంపం కేంద్రం పంజాబ్​లోని అమృత్​సర్​కు పశ్చిమాన 415 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొంది.

బుధవారం మధ్యాహ్నం పాకిస్థాన్​లోని లాహోర్‌, ఇస్లామాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్​ స్కేలుపై 5.7గా నమోదైందని తెలిపింది. మరోవైపు, 5.4 తీవ్రతతో వచ్చిన భూకంపం భారత్‌, అఫ్గానిస్థాన్​ను ప్రభావితం చేసినట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది.

Earthquake in Delhi : దిల్లీలో స్వల్పంగా భూప్రంపనలు సంభవించాయి. పాకిస్థాన్​లో వచ్చిన భూకంపం కారణంగానే దిల్లీ, ఎన్​సీఆర్​ పరిధిలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే భూకంపం కేంద్రం పంజాబ్​లోని అమృత్​సర్​కు పశ్చిమాన 415 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొంది.

బుధవారం మధ్యాహ్నం పాకిస్థాన్​లోని లాహోర్‌, ఇస్లామాబాద్‌ సహా పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్​ స్కేలుపై 5.7గా నమోదైందని తెలిపింది. మరోవైపు, 5.4 తీవ్రతతో వచ్చిన భూకంపం భారత్‌, అఫ్గానిస్థాన్​ను ప్రభావితం చేసినట్లు యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.