Earthquake in Delhi : దిల్లీలో స్వల్పంగా భూప్రంపనలు సంభవించాయి. పాకిస్థాన్లో వచ్చిన భూకంపం కారణంగానే దిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. అయితే భూకంపం కేంద్రం పంజాబ్లోని అమృత్సర్కు పశ్చిమాన 415 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొంది.
బుధవారం మధ్యాహ్నం పాకిస్థాన్లోని లాహోర్, ఇస్లామాబాద్ సహా పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చినట్లు ఆ దేశ వాతావరణ శాఖ వెల్లడించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైందని తెలిపింది. మరోవైపు, 5.4 తీవ్రతతో వచ్చిన భూకంపం భారత్, అఫ్గానిస్థాన్ను ప్రభావితం చేసినట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే పేర్కొంది.