ETV Bharat / snippets

'మణిపుర్‌ వెళ్లని ప్రధాని, ఉక్రెయిన్‌ అధ్యక్షుడిని కౌగిలించుకున్నారు'- మోదీపై కాంగ్రెస్ ఫైర్

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2024, 9:10 AM IST

PM Modi Ukraine Visit
PM Modi Ukraine Visit (Associated Press)

PM Modi Ukraine Visit : ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కొన్ని నెలలుగా ఘర్షణలు జరుగుతున్న మణిపుర్‌లో పర్యటించని ప్రధాని, ఉక్రెయిన్‌కు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడిని కౌగిలించుకున్నారని ఎద్దేవా చేసింది. ప్రధాని కౌగిలింతను 'హగ్లోమసీ'గా కాంగ్రెస్‌ పేర్కొంది. అది తన పని తాను చేసుకుపోయిందని చెప్పింది. మణిపుర్ ప్రజల కష్టాలను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని, ఈశాన్య రాష్ట్రాన్ని ఎందుకు సందర్శించడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. మణిపుర్ గురించి మోదీ ఆలోచించి ఉండాల్సిందని కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ ఇన్‌ఛార్జ్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌ అన్నారు. ప్రధాని రాక కోసం మణిపుర్ 15 నెలలుగా వేచి చూస్తోందని చెప్పారు. గత ఏడాది మే నెలలో మైతీ, కుకీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో మణిపుర్ హింసాత్మకంగా మారింది. అప్పటి నుంచి జరిగిన ఘటనల్లో దాదాపు 200 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

PM Modi Ukraine Visit : ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కొన్ని నెలలుగా ఘర్షణలు జరుగుతున్న మణిపుర్‌లో పర్యటించని ప్రధాని, ఉక్రెయిన్‌కు వెళ్లి ఆ దేశ అధ్యక్షుడిని కౌగిలించుకున్నారని ఎద్దేవా చేసింది. ప్రధాని కౌగిలింతను 'హగ్లోమసీ'గా కాంగ్రెస్‌ పేర్కొంది. అది తన పని తాను చేసుకుపోయిందని చెప్పింది. మణిపుర్ ప్రజల కష్టాలను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని, ఈశాన్య రాష్ట్రాన్ని ఎందుకు సందర్శించడం లేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. మణిపుర్ గురించి మోదీ ఆలోచించి ఉండాల్సిందని కాంగ్రెస్‌ కమ్యూనికేషన్స్‌ ఇన్‌ఛార్జ్‌ జనరల్‌ సెక్రటరీ జైరాం రమేష్‌ అన్నారు. ప్రధాని రాక కోసం మణిపుర్ 15 నెలలుగా వేచి చూస్తోందని చెప్పారు. గత ఏడాది మే నెలలో మైతీ, కుకీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో మణిపుర్ హింసాత్మకంగా మారింది. అప్పటి నుంచి జరిగిన ఘటనల్లో దాదాపు 200 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.