Live: కడపలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ షర్మిల - ప్రత్యక్ష ప్రసారం - YS Sharmila Reddy - YS SHARMILA REDDY
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/04-05-2024/640-480-21385156-thumbnail-16x9-ys.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 4, 2024, 4:07 PM IST
|Updated : May 4, 2024, 4:25 PM IST
YS Sharmila Reddy press meet Live: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, వైఎస్ఆర్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్కు నవ సందేహాల పేరిట షర్మిల ప్రశ్నలు సందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కడపలో నిర్వహించిన భహిరంగ సభలో సైతం సీఎం జగన్ అక్రమాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజశేఖరరెడ్డికి సీఎం జగన్ రాజకీయ వారసుడు కాదని ఎద్దేవా చేశారు. వివేకాను హత్య చేసిన వ్యక్తులను సీఎం జగన్ వెనకేసుకస్తున్నారని ఆరోపించారు. తండ్రికి న్యాయం చేయాలంటూ సునీత తిరుగుతుంటే, ఆమెకు అండగా ఉండాల్సింది పోయి. వాళ్లపైనే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయం ఉందని సీబీఐ చెబుతుందని ఆరోపించారు. ఇంత తెలిసినా సీఎం జగన్ కడప ఎంపీ టికెట్ మళ్లీ అవినాష్ రెడ్డికి ఎందుకు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రశ్నిస్తున్న తనపై వైసీపీ పెయిడ్ ఆర్టీస్ట్లతో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. కడపలో కాంగ్రెస్ జండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Last Updated : May 4, 2024, 4:25 PM IST