LIVE శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో షర్మిల ఎన్నికల ప్రచారం - ప్రత్యక్ష ప్రసారం - YS SHARMILA ELECTION CAMPAIGN - YS SHARMILA ELECTION CAMPAIGN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 28, 2024, 4:38 PM IST
|Updated : Apr 28, 2024, 5:21 PM IST
YS Sharmila election campaign live in Tekkali of Srikakulam district : జగన్ సీఎం అయ్యాక ప్రత్యేక హోదాను మరచిపోయారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో షర్మిల ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలియదా అని షర్మిల ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఈ సీఎంకు తెలియదా అంటూ నిలదీశారు. ఐదేళ్లు అయ్యిందని, ప్రత్యేక హోదా ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి: రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు గురించి జగన్ ఆలోచించట్లేదని షర్మిల విమర్శించారు. మూడు రాజధానులన్నారని, ఒక్కటీ లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మన రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు. మీ చేతిలో ఉన్న ఓటు అనే ఆయుధాన్ని సరైన వ్యక్తికి వేయాలని షర్మిల పిలుపునిచ్చారు. ప్రస్తుతం టెక్కలిలో షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు - ప్రత్యక్ష ప్రసారం మీ కోసం
Last Updated : Apr 28, 2024, 5:21 PM IST