మంత్రి లోకేశ్​ పర్యటనలో అనుమానస్పదంగా డ్రోన్​ - ఉలిక్కిపడ్డ పోలీసులు - Drone issue in independence day

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 3:53 PM IST

thumbnail
ముఖ్య అతిథిగా మంత్రి నారా లోకేశ్​- అనుమానస్పదంగా డ్రోన్​- ఉలిక్కిపడ్డ పోలీసులు (ETV Bharat)

YouTuber Flew Drone Without Permission in Independence Day Celebrations at Guntur Police Parade Ground : గుంటూరు పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో డ్రోన్ కలకలం సృష్టించింది. ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్​ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకల్లో డ్రోన్ తిరగడం అధికారులు, పోలీసుల్ని ఉలిక్కిపడేలా చేసింది. నగరానికి చెందిన ఓ యూట్యూబర్ అనుమతి లేకుండా డ్రోన్‌తో స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలను చిత్రీకరించేందు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆ యూట్యూబర్(యువతి)​ను అదుపులోకి తీసుకుని,  డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఆమె తన పేరు నందినిగా పేర్కొంది. పల్నాడు జిల్లా బొల్లాపల్లి ఏఎస్సై శ్రీనివాసరావు కుమార్తె అని పోలీసులకు చెప్పడం జరిగింది. ఈ  క్రమంలో ఆ యూట్యూబర్​ తాను గతంలో కూడా అనేక కార్యక్రమాలను ఇలాగే చిత్రీకరించానని, ఇప్పుడు అనుమతి కావాలని కొత్తగా అడుగుతున్నారేంటని పోలీసులను ప్రశ్నించడంతో అధికారులంతా అవాక్కయ్యారు. డ్రోన్​ను పోలీసు అధికారులు సీజ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.