జీవీఎంసీ భవనాన్ని నాకు క్యాంపు కార్యాలయంగా ఇచ్చారు : మంత్రి బొత్ససత్యనారాయణ - Botsa Satyanarayana - BOTSA SATYANARAYANA
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/09-04-2024/640-480-21180315-thumbnail-16x9-bosta-satya-narayana.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 9:28 AM IST
YCP Leaders Botsa Satyanarayana Comment on GVMC Building in Visakha : విశాఖ బీచ్ రోడ్లోని జీవీఎంసీ భవనంలో మకాం వేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అంగీకరించారు. జీవీఎంసీ భవనాన్ని తనకు క్యాంపు కార్యాలయంగా ఇచ్చారని తన కుటుంబ సభ్యలు అందులో ఉండొచ్చన్నారు. గతంలో వైసీపీకి ఎన్నిక వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ మాటలనూ మంత్రి బొత్స ఖండించారు. నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నారని అన్నారు. ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాలనీ ఒత్తిడి తేవడం అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు.
తను జీవీఎంసీ భవనంలో ఉంటే, బయట ఎస్కార్ట్ వాహనం ఉండదా అని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రచార రథం రోడ్డుపై ఆగి ఉంటే ఆ ఫొటోను ప్రచారించారు అంటూ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్తో మాట్లాడి మీడియాకు శిక్షణ ఇప్పించాలని బొత్స పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలను రాజకీయ నాయకులకు కేటాయించకూడదు. వాటిలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకూడదు. ఎన్నికల నిబంధనలను సీనియర్ నాయకుడైన బొత్సకు తెలిసినా, అడ్డగోలుగా సమర్థించుకున్నారు.