పూతలపట్టులో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు- టీడీపీ నేతలపై దాడి - Clash Between YCP And TDP - CLASH BETWEEN YCP AND TDP
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 7, 2024, 9:32 PM IST
YCP Leaders Attack With TDP Leaders in Chittor District: ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరడంతో వైసీపీ దౌర్జన్యాలు, దాడులను పెంచింది. ప్రచారంలో విపక్షాలపై కవ్వింపు చర్యలకు దిగడంతోపాటు మూకదాడులకు పాల్పడుతోంది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాలలో తెలుగుదేశం, వైసీపీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తెలుగుదేశం ఎన్నికల ర్యాలీ నేపథ్యంలో జెండాలు కడుతున్న వారిపై వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు దిగారు. రెండు పార్టీల వారి మధ్య వాగ్వాదం జరిగింది.
TDP Leaders Vehicles Destroyed: వైసీపీ నేతల దాడిలో తెలుగుదేశం నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతిదాడులకు దిగడంతో పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. దాడులకు దిగిన టీడీపీ నేతలను అరెస్టు చేయాలంటూ వైసీపీ అభ్యర్థి సునీల్ కుమార్ పోలీసులతో వాదనకు దిగారు. వైసీపీ నేతల దౌర్జన్యాలను అరికట్టాలని పూతలపట్టు కూటమి అభ్యర్థి మురళీమోహన్ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ నేతలు దాడులకు దిగుతున్నారని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.