కాకినాడ జిల్లాలో డయేరియా కలకలం - ఒక మహిళ మృతి, 30 మందికి అస్వస్థత - Woman Dead in Diarrhoea - WOMAN DEAD IN DIARRHOEA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 22, 2024, 4:59 PM IST

Woman Dead For Diarrhoea in Kakinada District: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో డయేరియా కలకలం రేపింది. వాంతులు విరేచనాలు లక్షణాలతో 30 మంది అస్వస్థతకు గురవ్వగా సత్యవేణి అనే మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. గ్రామంలో అధికారులు వైద్య శిబిరం ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు. అయితే ఈ నెల 19వ నుంచి గ్రామంలో డయేరియాతో ప్రజలు ఆస్పత్రిలో చేరుతున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. 

డయేరియా ప్రబలటంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి వాసంశెట్టి సుభాష్‌, ఎమ్మెల్యే చినరాజప్ప అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి కట్టడి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాధితులను పరామర్శించారు. గ్రామంలో ఎక్కడ చూసినా అపారిశుద్ధ్యం తాండవిస్తుండటంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. మంచినీటీ ట్యాంకులు, కాలువల వద్ద శుభ్రత లేకపోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని చోట్ల కూడా డయేరియా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.