వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకే తమ మద్దతు- వీరశైవ సంక్షేమ సంఘం - Veerashaiva leaders thanked to cbn - VEERASHAIVA LEADERS THANKED TO CBN
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 31, 2024, 6:57 PM IST
Veerashaiva Community Leaders Thanked to CBN : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీర శైవులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తామని వీరశైవ సంక్షేమ సంఘం నాయకుడు శివరాజ్ అన్నారు. కర్నూలు జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో వీరశైవ కులస్తుడైన వీరభద్ర గౌడ్కు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కర్నూలు టీడీపీ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు, లోకేశ్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా శివరాజ్ మీడియాతో మాట్లాడూతూ, కొద్ది రోజులు కిందట చంద్రబాబుని కలిసి ఆలూరు టికెట్ వీరభద్ర గౌడ్కు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాం. తమ మాటను గౌరవించి వీరశైవ వర్గానికి చెందిన వీరభద్రకు అధిష్టానం టికెట్ ఇవ్వడం చాలా సంతోషకరం. వచ్చే ఎన్నికల్లో వీర శైవులందరూ ఏకమై వీరభద్ర గౌడ్ని భారీ మేజార్టీతో గెలిపించుకుంటాం. అలాగే రాష్ట్రంలోని తమ వర్గం వారందరు ఒకే తాటిపైకి వచ్చి వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోని తీసుకువస్తాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తమకు ఎంతో గుర్తింపు ఉంటుంది. ఈ సందర్భంగా వీరశైవుల డిమాండ్లను చంద్రబాబు నాయుడు అంగీకరించినందుకు శివరాజ్ కృతజ్ఞతలు తెలిపారు.