గిరిజన ప్రాంతాల్లో రేషన్ షాపుల పునరుద్ధరణ- అరకు కాఫీ షాపుల ఏర్పాటు : మంత్రి - Distribution of Ration in Tribal - DISTRIBUTION OF RATION IN TRIBAL
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 25, 2024, 5:34 PM IST
Tribal Minister Gummadi Sandhya Rani Press Meet : గిరిజన ప్రాంతాల్లో ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీకి త్వరలోనే స్వస్తి పలుకుతామని గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఇక నుంచి చౌక దుకాణాల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో 960 చౌక దుకాణాల్ని మళ్లీ పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. ఆయా చౌక దుకాణాల ద్వారానే బియ్యం, ఇతర సరకుల పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ సరిగ్గా జరగలేదని తెలిపారు. సీఎం నుంచి అనుమతి తీసుకున్న అనంతరం చౌకదుకాణాల ద్వారా రేషన్ పంపిణీ పునరుద్ధరిస్తామని వెల్లడించారు.
అలాగే గిరిజన హాస్టళ్లలో ఏఎన్ఎంలను నియమిస్తున్నామని పేర్కొన్నారు. ఫీడర్ అంబులెన్సులు, తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు మళ్లీ అమల్లోకి వస్తాయన్నారు. మెగా డీఎస్సీ ద్వారా కొన్ని పోస్టులను ఎస్టీలకే రిజర్వు చేశామని వెల్లిడించారు. వాటి ద్వారా ఉపాధ్యాయుల కొరత తీరుతుందని తెలిపారు. గంజాయి నియంత్రణపై ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ వంద రోజుల్లో కార్యాచరణ చేపడుతుందని వెల్లడించారు. టీటైమ్ లాగే జీసీసీ ద్వారా అరకు కాఫీ షాప్లు ఏర్పాటు చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.