'ఈనాడు పత్రిక వల్ల వేల మందికి ఉపాధి - రామోజీ మన మధ్య లేకపోవడం బాధాకరం' - Distributors pay tribute to ramoji
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg?imwidth=128)
Published : Jun 30, 2024, 10:15 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/30-06-2024/640-480-21834974-thumbnail-16x9-ramoji.jpg)
Telugu Magazines Distributors Pay Tribute to Eenadu Group Chairman Ramoji Rao : తెలుగు పత్రిక రంగానికి రారాజైన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మన మధ్య లేకపోవడం బాధాకరమని కరీంనగర్ తెలుగు పత్రికల పంపిణీదారులు వెల్లడించారు. ఎన్ని పత్రికలు వచ్చినా గత ఐదు దశాబ్దాలుగా ఈనాడు పత్రిక సర్క్యూలేషన్లో నంబర్ 1గా నిలిచిందని అన్నారు. కరీంనగర్ తెలుగు దినపత్రిక పంపిణీ ఆధ్వర్యంలో రామోజీరావు చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బస్టాండ్ ఎదురుగా సుమారు 700 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈనాడు పత్రిక వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమంది ఉపాధిని పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఈనాడు యూనిట్ మేనేజర్ యుగంధర్ రెడ్డి, సర్క్యూలేషన్ ఇంఛార్జి దత్తాత్రేయ, హెచ్ఆర్ ఇంఛార్జి అనంత్రెడ్డితో పాటు నగరంలోని తెలుగు పత్రికల పంపిణీదారులు పాల్గొన్నారు. జూన్ 8వ తేదీన రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త విని రాజకీయ, సినీ రంగాలు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాయి.