thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 2:25 PM IST

ETV Bharat / Videos

టీటీడీ పత్రాలు, కంప్యూటర్ల ధ్వంసానికి కుట్ర- ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయం: ఆనం - TDP Leader Anam Fires on YSRCP

TDP Senior Leader Anam Venkataramana Reddy Fires on YSRCP :  తిరుమలలో దోచుకోవడమే వైఎస్సార్సీపీ పనిగా పెట్టుకుందని తెలుగుదేశం సీనియర్‌ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే అన్ని విషయాల్లో విచారణ చేస్తామన్నారు. టీటీడీ పత్రాలు, కంప్యూటర్ల ధ్వంసానికి కుట్రలు చేస్తున్నారన్నారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన టీడీపీ నేత అనం వెంకటరమణారెడ్ది తప్పులు చేసినోళ్లు రాష్ట్రం వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారన్నారు.  శ్రీవాణి ట్రస్ట్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారని, ప్రపంచంలో ఎక్కడున్నా ధర్మారెడ్డి జైలుకెళ్లడం ఖాయంమని స్పష్టం చేశారు.

YSRCP Leaders Looted in Tirumala : బోర్డు సమావేశాలను టీటీడీ వెబ్‌సైట్‌లో కరుణాకర్‌రెడ్డి ఎందుకు పెట్టలేదని ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయమైంది ధ్వజమెత్తారు. తిరుమలలో పేదోళ్లకు ఆకలేస్తే తినే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతి చేసిన వాళ్లు కూటమి అధికారంలోకి వచ్చాక ఊచలు లెక్కపెట్టక తప్పదని ఆనం హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.