thumbnail

సీఎం జగన్​కు దమ్ముంటే గుంటూరులో పోటీ చేయాలి: టీడీపీ నేత పెమ్మసాని చంద్రశేఖర్​ - Pemmasani challenge to CM Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 12, 2024, 12:22 PM IST

TDP Leader Pemmasani Chandrasekhar Election Campaign in Guntur : సీఎం జగన్​కు దమ్ముంటే గుంటూరు వచ్చి పోటీ చేయాలని టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్​ సవాల్​ విసిరారు. అందుకు తాను సిద్ధమని బహిరంగంగా ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంలో తాడికొండ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. ఆయనతో పాటు టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి తెనాలి శ్రావణ్​ కుమార్​ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దామరపల్లి, పొన్నెకల్లు గ్రామాల్లో రోడ్​ షోను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గుంటూరు ప్రజలకు అభివృద్ధి కావాలి, కానీ అరాచకం కాదు అని పెమ్మసాని చంద్రశేఖర్​ తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని ఓడిస్తే రాష్ట్రంలో తనకు ఇక తిరుగు ఉండదనే పిచ్చి భ్రమలో జగన్​ ఉన్నారని పేర్కొన్నారు. టీడీపీ పార్టీని అంతమొందించడం ఎవరి వల్ల సాధ్యం కాదని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్​కు తామంతా ఉక్కు కవచంలా నిలబడతామన్నారు. గుంటూరు పార్లమెంటు ఎంపీ అభ్యర్థులుగా నలుగురిని మార్చారని, వాళ్లు, వీళ్లు ఎందుకు దమ్ముంటే జగన్​నే వచ్చి పోటీ చేయాలని సవాల్​ విసిరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.