సిట్ నివేదికను డీజీపీ వెంటనే బయటపెట్టాలి: బొండా ఉమ - TDP Bonda Uma on SIT Report

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 21, 2024, 5:15 PM IST

thumbnail
సిట్ నివేదికను డీజీపీ వెంటనే బయటపెట్టాలి: బొండా ఉమ (ETV Bharat)

TDP Leader Bonda Uma Comments on SIT Report: జగన్ రెడ్డి కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. సిట్ రిపోర్టును వెంటనే డీజీపీ బయట పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలన్నారు. రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెళ్లి సోదరులు, భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి తండ్రీ కుమారులను వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. 

సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలని, అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్ట్ చేయాలని అన్నారు. అధికారుల సస్పెండ్​పై పోలీసు సంఘం నోరుమెదపాలన్నారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లలో బాంబులు, వేట కొడవళ్లు దొరికినా కేసులు నమోదు చేయకపోవడం దారుణమని మండిపడ్డారు. హింస సృష్టించిన వైఎస్సార్సీపీ నేతలపై నామమాత్రపు కేసులు పెట్టడంపై విచారణ చేపట్టాలని, ఇంకా వైఎస్సార్సీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.