thumbnail

'వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నప్పుడే దేవాలయాలపై దాడులు జరిగాయి' - Dundi Rakesh Fires On Vellampalli

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 5:34 PM IST

TDP Dundi Rakesh Fires On Vellampalli Srinivas : వెల్లంపల్లి శ్రీనివాస్ మంత్రిగా ఉన్నప్పుడే హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయని తెలుగుదేశం నేత డూండి రాకేశ్ ఆరోపించారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో ఆర్య వైశ్య ద్రోహి వెల్లంపల్లి శ్రీను అనే కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. కరపత్రంలో ఉన్న 10అంశాలపై వెల్లంపల్లి శ్రీను సమాధానం చెప్పాలన్నారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ చేశారు. ఎన్నికల్లో (Elections) సెంట్రల్‌ నియోజకవర్గ ప్రజలు వెల్లంపల్లిని ఓడిస్తారని అన్నారు.
Dundi Challenge to Vellampalli  : జగన్ విజయవాడ వెస్ట్ లో ఉండాల్సిన చెత్తను తీసుకువచ్చి సెంట్రల్ లో వేశారని ఆరోపించారు. వెలంపల్లి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. తాము విడుదల చేసిన కరపత్రాన్ని ప్రజల్లోకి తీసుకువెళతానన్నారు. ఇప్పటికైనా వెలంపల్లి నిజాలు మాట్లాడకపోతే వెల్లంపల్లి శ్రీనివాస్‌ (Vellampalli Srinivas) ఎక్కడ ప్రచారానికి వస్తే అక్కడకి వచ్చి ఈ కర పత్రాలను పంచుతామని డూండి రాకేష్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.