By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 17, 2024, 10:34 PM IST
సుప్రీంకోర్టు జడ్జి గారు మళ్లీ పెళ్లి చేసుకుని.. ఇలా ముచ్చటపడ్డారు! - Judge Justice Maheshwari Marriage
Supreme Court Judge Justice Maheshwari Marriage : సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి దంపతులు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుగా మారిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రాంతాలను సందర్శించిన దంపతులు గిరిజన సంప్రదాయ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. సమీపంలోని గిరి గ్రామదర్శినిలో గిరిజన సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజన పెద్దలు వివాహ తంతును జరిపించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరి దంపతుల కుటుంబ సభ్యలు సైతం పాల్గొన్నారు. వారు సైతం గిరిజన వేషధారణలో సరదాపడుతు ఫోటోలకు ఫోజులిచ్చారు. జస్టిస్ దంపతులు గిరిజనులతో కలిసి నృత్యం చేశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి మాట్లాడుతూ గిరిజన సంప్రదాయ ప్రకారం వివాహం చేసుకోవడం కొత్త అనుభూతిని మిగిల్చిందని అన్నారు. అనంతరం వారు గిరిజన మ్యూజియం, బొర్రా గుహలను సందర్శించారు. అంతకముందు అరకులోయకు రైలులో వచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి మహేశ్వరి దంపతులకు ఐటీడీఏ పీవో అభిషేక్ జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్తో పాటు విశాఖపట్నం నుంచి వచ్చిన న్యాయమూర్తులు ఘన స్వాగతం పలికారు.