ఊరు విడిచి వెళ్లిన మహిళ- ఇంతలోనే ఇల్లు దగ్దం! - Fire Accident In Nellore District

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 12:42 PM IST

thumbnail
ఊరు విడిచి వెళ్లిన మహిళ- ఇంతలోనే ఇల్లు దగ్దం! (ETV Bharat)

Fire Accident In Nellore District : నెల్లూరు జిల్లా ఏఎస్​ పేట మండలం గండువారిపల్లిలో అర్ధరాత్రి ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన రజియా అనే మహిళ మాంత్రికులతో కలిసి క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నారని  గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి రజియా కుటుంబం ఊరి నుంచి వెళ్లిపోయారు. క్షుద్ర పూజలు చేసిన ఇంట్లో అర్ధరాత్రి మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిని తగలబెట్టి ఉంటారని ఇందులో భయపడాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసలే క్షుద్రపూజలు చేస్తుందనే అనుమానంతో వణికిపోతున్న వాసులు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డారు. ఇంటికి ఎవరు మంట పెట్టారనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.