హుస్సేన్​సాగర్​లో ప్రారంభమైన పారిశుద్ధ్య పనుల ప్రక్రియ - Ganesha immersions in Tankbund

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2024, 4:34 PM IST

thumbnail
హుస్సేన్​సాగర్​లో ప్రారంభమైన పారిశుద్ధ్య పనులు (ETV Bharat)

Cleaning Process in Tankbund: గణేశ్ నిమజ్జనాలు జరుగుతుంటే హుస్సేన్​సాగర్ పరిసర ప్రాంతం జనసంద్రోహంతో ఎంత కలర్​ఫుల్​గా ఉంటుందో, నిమజ్జనం తర్వాత అంతే దారుణంగా తయారవుతుంది. సంజీవయ్య పార్క్​ పక్కన హుస్సేన్​సాగర్​లో, నెక్లెస్​రోడ్​లో ఏర్పాటు చేసిన కొలనులో పేరుకుపోయిన వ్యర్థాలను జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు తొలగించి ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్​కు తరలిస్తున్నారు. పూలు, సామగ్రి,  వస్త్రాలు, కాగితాలు, ఇతర చెత్తా చెదారం సైతం సిబ్బంది తొలగిస్తున్నారు. ప్రతిరోజు ఐదారు ట్రక్కుల వ్యర్థాలను తరలిస్తున్నామని హెచ్​ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.  

ఒక పక్క వినాయకుల నిమజ్జనం కొనసాగుతుండగా మరోవైపు హుస్సేన్​సాగర్​లో క్లినింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాగర్​లోని వ్యర్థాలను తొలగించే బాధ్యతను హెచ్‌ఎండీఏ(హైదరాబాద్ మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ అథారిటీ), రోడ్లను శుభ్రం చేసే బాధ్యతను జీఎచ్ఎం​సీ(గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​) తీసుకుని పనులను మొదలుపెట్టాయి. ప్రకృతికి హాని కలిగించే వినాయకుల విగ్రహాలను హుస్సేన్​సాగర్​లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మట్టితో తయారుచేసిన విగ్రహాలను మాత్రమే నిమజ్జనం చేయాలని తీర్పునిచ్చింది.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.