పింఛను డబ్బులు చోరీ చేశారని డ్రామా - సచివాలయ ఉద్యోగి సస్పెన్షన్ - Sachivalayam employee Suspended
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg?imwidth=128)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 1, 2024, 7:38 PM IST
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01-07-2024/640-480-21842457-thumbnail-16x9-sachivalayam-employee-suspended.jpg)
SACHIVALAYAM EMPLOYEE SUSPENDED: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు ఏడో సచివాలయం మౌలిక సదుపాయాల కార్యదర్శి మురళీమోహన్పై సస్పెన్షన్ వేటుపడింది. మురళీమోహన్ను సస్పెండ్ చేస్తూ పురపాలక కమిషనర్ రఘునాథ్రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ డబ్బును సొంతానికి ఉపయోగించుకున్న మురళీమోహన్, ఆ డబ్బులు దుండగులు అపహరించారంటూ అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. స్పృహ తప్పి కింద పడి ఆసుపత్రిలో చేరానంటూ కట్టుకథ అల్లారు.
ఉదయం పింఛన్ డబ్బులు పంపిణీ చేయడానికి వెళుతుండగా స్పృహ తప్పి బైక్ పైనుంచి కింద పడిపోయానని, ఈ క్రమంలో 4 లక్షల రూపాయల డబ్బును దుండగులు అపహరించారని కార్యదర్శి మురళి చెబుతున్నారు. అతన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా పింఛన్ డబ్బులు మాయం అవ్వడంపై పోలీసులు, పురపాలక అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. మురళీమోహన్ ఆన్లైన్ బెట్టింగ్ ఆడి పెన్షన్ డబ్బులు పోగొట్టినట్లు తేలింది. దీంతో అతన్ని మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పురపాలిక అధికారుల ఫిర్యాదు మేరకు మురళీమోహన్పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.