అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు - డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం! - RTC Bus Accident in kothagudem Dist - RTC BUS ACCIDENT IN KOTHAGUDEM DIST

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : May 12, 2024, 8:59 PM IST

RTC Bus Accident In kothagudem Dist : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మోతె గ్రామం వద్ద ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. జిల్లాలోని మణుగూరు నుంచి భద్రాచలానికి వస్తుండగా, మోతె గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా బస్సు పొలాల్లోనికి దూసుకెళ్లడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. మహిళలు, పిల్లలకు గాయాలయ్యాయి.

గాయాలైన మహిళలను, చిన్నారులను భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారికి సాధారణ గాయాలు అయ్యాయి. డ్రైవర్ అప్రమత్తంగా ఉండకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చెప్పారు. గతంలో ఇలాంటి ఘటనే పెద్దపల్లి జిల్లాలో జరిగింది. లారీని తప్పించబోయిన ఓ ఆర్టీసీ బస్సు, పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ప్రైవేటు వాహనాల్లో ఆసుపత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.