సింగ్​నగర్​లో కొనసాగుతున్న వరద - పునరావాస కేంద్రాల్లోనే బాధితులు - Rehabilitation Center in Vijayawada

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 3, 2024, 3:27 PM IST

thumbnail
పునరావాస కేంద్రాల్లో బాధితులు- 'వరద తగ్గితే మా ఇళ్లకు మేం పోతాం' (ETV Bharat)

Rehabilitation Centers to Flood Victims in Vijayawada : విజయవాడలో వరదలు సృష్టించిన విపత్తు ప్రజలను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను ప్రభుత్వం ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించింది. అక్కడ భోజన, వసతి సదుపాయాలను సమకూర్చారు. మరోవైపు విజయవాడలో వరద క్రమంగా తగ్గుతోంది. యనమలకుదురులోని పలు కాలనీల్లో ఇళ్లలో నీరు తగ్గింది. దీంతో స్థానికులు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. సింగ్‌నగర్‌లో వరద ప్రభావం తగ్గేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి కొంతమేర వరద తగ్గడంతో లంక గ్రామాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బుడమేరులోనూ వరద ప్రభావం తగ్గింది. విజయవాడలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ పునరుద్ధరణకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. పునరావాస కేంద్రాల్లో పరిస్థితిని ఈటీవీ ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.