కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్​ - తెలంగాణ, విజయవాడ మధ్య రైళ్లు రద్దు - Railway track washed in Kesamudram

By ETV Bharat Telangana Team

Published : Sep 1, 2024, 8:35 PM IST

thumbnail
కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్​ - తెలంగాణ, విజయవాడ మధ్య రైళ్లు రద్దు (ETV Bharat)

Railway Track Washed Away in Mahabubabad Kesamudram : మహబూబాబాద్​ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. కేసముద్రం-ఇంటికన్నె మార్గంలోని రైల్వే ట్రాక్​ పూర్తిగా ధ్వంసమైంది. కేసముద్రం రైల్వేస్టేషన్​లో పలు రైళ్లను నిలిపివేశారు. ప్రయాణికులకు పోలీసులు అల్పాహారం, నీరు అందించారు. ఈ రైల్వే ట్రాక్​ పూర్తిస్థాయిలో దెబ్బతింది. రైల్వే ట్రాక్​ కింద ఉండే కంకర మొత్తం వరదకు కొట్టుకుపోయింది. దీంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు 24 రైళ్లను నిలిపివేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే హెల్ప్​ లైన్​ను ఏర్పాటు చేసింది. రైల్వే అధికారులు కేసముద్రం-ఇంటికన్నె మార్గంలోని రైల్వే ట్రాక్​ను పునరుద్ధరిస్తున్నారు. 

రైల్వేకు సంబంధించిన ట్రాక్​లు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం కలిగింది. కాజీపేట, రాయనపాడులో ట్రాక్​లు తెగిపోవడం రైళ్లు నిలిపివేశారు. ఇవాళ, రేపు 80 రైళ్లు రద్దు, మరో 48 రైళ్లను దారి మళ్లించారు. హైదరాబాద్​-విజయవాడ రూట్​లోనే అత్యధిక రైళ్లు రద్దు అయ్యాయి. పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.